మన్ననూరులో జర్నలిస్టుల గర్జన.. 28న TWJF మహాసభలు!
నల్లమల వేదికగా జర్నలిస్టుల హక్కుల పోరాటం.
రాష్ట్ర నేతల రాక.. జర్నలిస్టులంతా ఏకం కావాలి.
జర్నలిస్టుల సమస్యలపై చర్చకు TWJF సిద్ధం.
నాగర్కర్నూలు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) నాగర్కర్నూలు జిల్లా మహాసభలను ఈనెల 28న అమ్రాబాద్ మండలం మన్ననూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్ దూమర్ల భాస్కర్, కో-కన్వీనర్ చారగొండ బాలకృష్ణ తెలిపారు. నల్లమల ప్రాంతంలో జరగనున్న ఈ మహాసభలకు రాష్ట్రస్థాయి నేతలు భారీగా హాజరుకానున్నారు.
ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, రాష్ట్ర నేతలు బండి విజయ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొని జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయనున్నారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించి, హక్కుల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను ఇక్కడ రూపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ ఈ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com