కేంద్రంపై బీసీ జేఏసీ పోరాడితేనే 18న రాష్ట్ర బంద్ కు సిపిఎం మద్దతిస్తుందని
సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 17న అంబేద్కర్ చౌక్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా, కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటున్న దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర్ ఆచారి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ పాల్గొని ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్లపై బిజెపి నాటకం ఆడుతుందని కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో బందుకు మద్దతు అంటూ 2 నాలికల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ ద్వంద వైఖరి బిజెపి మానుకొని కేంద్రంలో బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై బీసీ జేఏసీ పోరాడితేనే 18న రాష్ట్ర బంద్ కు సిపిఎం మద్దతిస్తుందని లేదంటే స్వతంత్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అఖిలపక్షం నిర్వహించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని అన్నారు. బిజెపి ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్స్ బిల్లులు, ఆర్డినెన్స్ లు అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బందుకు బిజెపి మద్దతు ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బందులో పాల్గొంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు కోసం కులగరణ చేసింది. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.అయినా ఆరు నెలలైనా ఆమోదించలేదు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 ని విడుదల చేసింది జీవో నెంబర్ 9 కి వ్యతిరేకంగా హైకోర్టుకు కొందరు వెళితే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటీషన్ను సుప్రీంకోర్టు తీరస్కరించింది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది.బీసీ రిజర్వేషన్స్ అమలు పూర్తి బాధ్యత , బీసీ రిజర్వేషన్స్ పై రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చేర్చితే ఏ సమస్య ఉండదు. బీసీలు అర్థం చేసుకోవాలి బిజెపి ఏ లా అడ్డుకుంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటూనే అమలు చేయాల్సిన బాధ్యత అమలు చేయకుండా మేము మద్దతు అని బిజెపి అనడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు.ఈ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు. అక్టోబర్ 18న జరిగే బీసీ జేఏసీ తెలంగాణ బందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. బిజెపి మద్దతు ఇచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు. ఎవరితో బాలు ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.రాజు, ఏ.లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, సిపిఎం పట్టణ నాయకులు డి. కురుమయ్య,,మదన్, గంధం గట్టయ్య, జి. బాలస్వామి, రమేషు, జి రాబర్ట్,సాయి లీల, బాల పీరు, ఉమా, నందిమల్ల రాములు,ఎల్లయ్య, దేవరాజు,మద్దిలేటి,జి భాస్కర్, డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com