• బిర్సా ముండా త్యాగాలు చిరస్మరణీయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
• కేంద్ర పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలి.. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి
• 186 ఏకో ఫ్రెండ్లీ గృహాలను అందించిన కేంద్రం; విద్యా సంస్థలకు కృషి చేస్తామని హామీ
భౌరాపూర్-చెంచుపెంట (లింగాల): సాహస గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు నేడు అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం, భౌరాపూర్–చెంచుపెంటను సందర్శించారు. 'జనజాతీయ గౌరవ దివస్' కార్యక్రమాలలో భాగంగా, ఆయన ఆదివాసీ సోదరులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల జీవన పరిస్థితులు, కష్టాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. అనంతరం చెంచుపెంటలో బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
బిర్సా ముండా త్యాగాలు.. అసలైన రక్షకులు ఆదివాసీలే:
రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. కేవలం 25 ఏళ్లకే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన బిర్సా ముండా త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పాత్ర ఎంతో విశిష్టమైనదని కొనియాడారు. ఆదివాసీలు భారత సంస్కృతి, సంపదకు అసలైన రక్షకులని తెలియజేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదివాసీల గౌరవం, సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు & అభివృద్ధి:
అత్యంత వెనుకబడిన చెంచుపెంట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చెంచులకు ఇప్పటికే 186 ఏకో ఫ్రెండ్లీ గృహాలను నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఆదివాసీలకు హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు:
ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న తీవ్ర మౌలిక సదుపాయాల కొరతపై రామ్ చందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల తీవ్ర కొరతను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మధ్యలో ఆగిపోకుండా, ప్రతి ఆదివాసీ కుటుంబానికి నేరుగా చేరేలా అధికారులు కర్తవ్య పాలకులుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామచందర్ రావు చెంచులకు దుప్పట్లను, ప్రధాని నరేంద్ర మోదీ మరియు బిర్సా ముండా చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, యువమోర్చా అధ్యక్షుడు కుండే గణేష్ తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com